Saturday, 2 November 2024

ప్రతిఘటన

 ఇది నా స్వీయ రచన 

ప్రతిఘటన 

అది బాలికల విద్యాలయం. ఆరోజు లెక్కలమాస్టర్ సెలవు పెట్టారు. 

ఉన్నట్టుండి  సత్య సీతతో  "మన లెక్కలమాస్టారి పధ్ధతి ఏం బాగాలేదు" అంది.

ఏదో అర్ధమయినట్లుగా సీత"నాకూ అలానే అనిపించింది "అంది.

అది వారికి  ఖాళీ  పిరియడ్  కావడంతో క్లాస్ లో గుసగుస లెక్కువయ్యేయి.

లంచ్ టైం లో అమ్మాయిలందరూ ఈ విషయమే  మాటాడుకున్నారు.ఇంటికి వెళ్ళాక ఈ విషయం తమ తల్లితండ్రులతో చెప్పాలనుకున్నారు. 

మర్నాటి ఉదయం చాలా మంది  తల్లితండ్రులు  వచ్చి ప్రిన్సిపాల్ ని కలిసి,ఆ మాస్టర్ అనైతిక ప్రవర్తన, అమ్మాయిలు ఎంత ఇబ్బంది పడుతున్నారో వివరించి వెంటనే  తగిన చర్యలు  తీసుకోవాలని  కోరేరు.

విచారణ జరిగాక  సదరు మాస్టర్ ని జైలు కి పంపడం జరిగింది.

No comments:

Post a Comment