Saturday, 2 November 2024

చల్లని నీడ

 ఇది నా  స్వీయ ‌రచన 

చల్లని నీడ

రంగనాధం పొద్దున్నే కోవెల కి  వెళ్లి, తిరిగి వస్తుంటే  ఒక అబ్బాయి  ఏడుస్తూ  కనిపించాడు. 

"ఏం బాబూ  ,ఎందుకు  ఏడుస్తున్నావు " అడిగాడు  రంగనాధం .

"నిన్న రాత్రి మా ఇంటిమీద  ఎవరో  దాడిచేసి కత్తి తో పొడి చేసారు. నాన్న " మీరు  పారిపోండి "అని కేకలు  పెడితే  మేము భయంతో చెరోవైపు పారిపోయాం.ఆ తరువాత  అమ్మ  నాకు కనబడలేదు " అన్నాడు  విశాల

రంగనాధం తానే ముసలయిపోయినా,విశా ల్ బాధ్యత తను  తీసుకుని వాళ్ళ  ఇంటికి తీసుకొని వెళ్ళాడు. 

వాళ్ళది మధ్య తరగతి కుటుంబం అయినా ఇంటిలో అందరూ విశాల్ ని తమతో  సమంగా, తమలో ఒకడిగా చూసేవారు. ఆ ఇల్లు  విశాల్  కి ఓ చల్లని  నీడ  అయింది.

No comments:

Post a Comment