ఇది నా స్వీయ రచన
మల్లీశ్వరి
మల్లీశ్వరి కి చాలా మంది అభిమానులు. అందరూ అభిమానం గా అక్కా అంటారు.
ఆడపిల్లలు ఎవరు ఏ సమస్య లో ఉన్నా అక్క దగ్గరకే పరిగెత్తుకొస్తారు.వాళ్ళని పై చదువులకి పంపించటం లేదని, చదువు మానిపించి ఇంట్లో కూర్చో పెడుతున్నారని,ఆటల పోటీలకి పంపడం లేదని ఇలా తల్లితండ్రుల మీదే రకరకాల ఫిర్యాదులు చేస్తుంటారు.
మల్లీశ్వరి అన్ని ఫిర్యాదులు ఓపిక గా వింటుంది. వాళ్ళ తల్లితండ్రుల దగ్గరికి వెళ్లి నయానభయాన అన్ని రకాలు గా చెప్పి వాళ్ళని ఒప్పిస్తుంది.అత్తమామలు ఏ కోడలితో దురుసుగా ప్రవర్తించినా ,ఏ భర్త భార్య ని హీనంగా చూసినా వాళ్ళ దగ్గరికి మీడియా ని తీసుకు వెళ్ళడానికి కూడా వెనుకాడదు మల్లీశ్వరి.
ఒక రోజు అక్క దగ్గరకి ఓ అబ్బాయి వచ్చేడు. తను సైన్యం లో చేరాలని అనుకుంటున్నాడని,తన తల్లితండ్రులు దానికి అంగీకరించడం లేదని ఫిర్యాదు.మల్లీశ్వరికి వాళ్ళని ఒప్పించగలనన్న నమ్మకం ఉంది.అదే మాట చెప్పి,ఆ అబ్బాయి తో కలిసి వాళ్ళ ఇంటికి బయలుదేరింది.
No comments:
Post a Comment