ఇది నా స్వీయ రచన
ఓ తల్లి తీర్పు
తులసమ్మకి కొడుకు, మనవడు పంచప్రాణాలు.కొడుకు, కోడలు చిలకా గోరింకల్లా ఉంటే చాలు అనుకునేది. ఇంట్లో చాకిరీతో ఆవిడకి రోజులు గడిచిపోయేవి.
అప్పుడప్పుడు కోడలి పుట్టింటివాళ్ళు వచ్చి రోజులతరబడి ఉండేవారు.తులసమ్మ విశ్రాంతి లేకపోయినా ఏ ఫిర్యాదు చేసేదికాదు.
ఓ రోజు తులసమ్మ కొడుకుతో "మీ మేనత్త సుశీల ఓ వృధ్ధాశ్రమంలో చేరింది.నన్నూ అక్కడకి వచ్చేయమంది.ఆ ఆశ్రమంలో నా స్నేహితురాళ్ళు మరి కొంతమంది కూడా ఉన్నారు. నేను రేపు అక్కడకి వెళ్ళిపోతాను " అని చెప్పింది.
అప్పటికి గాని తులసమ్మ కొడుక్కి తను ఏం నష్టపోతాడో,తల్లి విలువేంటో అర్ధం కాలేదు "
No comments:
Post a Comment