Monday, 11 November 2024

ప్రజా సేవ

 ఇది నా స్వీయ రచన 


ప్రజా సేవ 


రాజగోపాల్ ఒక రాజకీయ పార్టీ నాయకుడు. అతని  కొడుకు సుభాష్ తండ్రి పార్టీ లో కొన్నా కొన్నాళ్ళుండి, ఆ పార్టీ తీరుతెన్నులు నచ్చక వేరే పార్టీ పెట్టాడు. ఆ పార్టీ సిద్ధాంతాలు, పని తీరు జనాలకి నచ్చింది. 

సుభాష్ చెల్లెలు విద్య తన చదువు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చింది. అన్న కొత్తగా పెట్టిన పార్టీ పట్ల ఆమెకి ఆసక్తి కలిగింది. తాను కూడా అన్నతో సమంగా పార్టీ అభివృద్ధికి కష్టపడింది.


ఎన్నికల సమయంలో రాష్ట్రానికీ, కేంద్రానికీ ఒకేసారి ఎన్నికలు వచ్చేయి. సుభాష్ తన చెల్లెలు విద్యని లోక్ సభ ఎన్నికల బరిలో దింపి తాను శాసన సభకి పోటీ చేసేడు. ఇద్దరూ ఎన్నికల్లో గెలిచారు. విద్య  అత్యధిక మెజారిటీతో  గెలిచింది. 


ఇది  నా స్వీయ రచన 


ప్రజా సేవ -2వ‌ భాగం 


విద్య లోక్ సభకి ఎన్నికయింది కానీ అన్న ఏది చెప్పితే‌ అదే. కేంద్రంలో అధికారం చేపట్టవలసిన పార్టీ కి పూర్తి మెజారిటీ లేక సుభాష్ పార్టీ మద్దతు తీసుకోవలసి వచ్చింది. ప్రధాని విద్యకి మానవ‌ వనరుల శాఖ కేటాయిస్తామంటే ఆర్ధిక మంత్రిత్వ శాఖ కేటాయించాల్సిందే అని సుభాష్  పట్టు పట్టేడు. అతని డిమాండ్ కి కేంద్రం‌ తల ఒగ్గింది.

సుభాష్ శాసన సభ ఎన్నికల తరువాత మెజారిటీ పార్టీ నాయకుడుగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. 

విద్య ఆర్ధిక మంత్రి అయ్యాక సుభాష్  నుండి ఒత్తిడులు ఎక్కువయ్యాయి. రాష్ట్రానికి  అధిక వనరులు అడుగుతాడు. ఇంకా ఏవో అదనపు గ్రాంట్స్ డిమాండ్ చేస్తాడు. 

ఇదంతా రాష్ట్ర ప్రజల మెప్పు పొందడానికే సుభాష్ చేస్తున్నాడు. 


   కానీ ఒక రాష్ట్రానికి అధిక నిధులు ఇస్తే మిగతా రాష్ట్రాలూ అడుగుతాయి. అన్నీ తెలిసి విద్య  ప్రధాని దగ్గరకి  ఆ డిమాండ్లతో వెళ్ళలేదు. 

ఇది నా స్వీయ  రచన 


ప్రజా సేవ -3వ భాగం 


రాజగోపాల్ కి విద్య మీద  ఎంత ఒత్తిడి ఉందో అర్ధమైంది. అతను స్వయంగా  విద్యని కలిసి "నువ్వు, నీ అనుచరులతో కలిసి  నా పార్టీలోకి వచ్చేయ్.ఇప్పటికే ఎక్కువ మంది నా పార్టీ నుండి మీ అన్న పార్టీకి వెళ్ళిపోయారు" అన్నాడు. 

విద్య  బాగా  ఆలోచించింది. ప్రధానికి తన‌‌ సమర్ధత మీద చాలా నమ్మకం ఉంది. తను అన్న  పార్టీకి రాజీనామా చేసినా కేంద్రం ఆర్ధిక మంత్రిగానే కొనసాగించి,‌ రాజ్యసభ కి ఎంపిక చేస్తుంది. 

విద్య  తన అనుచరులతో, శ్రేయోభిలాషులతో చర్చించి 'అభ్యుదయ' పార్టీ స్థాపించింది.

     కొత్త  పార్టీలో కొందరు అన్న అనుచరులు, మరి కొందరు  తండ్రి పార్టీ నుండి చేరేరు. దాంతో‌ అన్న  ప్రభుత్వం మైనారిటీ లో పడిపోతే విద్య ‌అన్న పార్టీకి మద్దతు ఇచ్చి  ప్రభుత్వం పడిపోకుండా  కాపాడింది. 

తరువాతి ఎన్నికల్లో అభ్యుదయ పార్టీ రాష్ట్రంలో‌ అత్యధిక సీట్లు  సంపాదించి, విద్య  ముఖ్యమంత్రి అయింది. కేంద్రంలో కూడా  గణనీయంగా సీట్లు రావడంలో నూతన మంత్రివర్గం లో భాగస్వాములు అయ్యారు.విద్య తమ పార్టీకి చెందిన ఓ సమర్ధుడైన  నాయకుడు  ఆర్ధిక మంత్రిగా ఎన్నికయ్యేలా చూసింది. 



No comments:

Post a Comment