Friday, 11 November 2011

ashaa pardhivam

చిదిమిన పాల్గారు
చిన్నారి మొగ్గలు త్రుటిలో మసిబొగ్గులుగా
మార్చిన కుంభకోణం అగ్నిప్రమాదం

ఆనాడు శుష్కమై గాలిలో కలిసిన
పసికూనల ఆర్తనాదాలు
ఈనాటికీ నాచెవిలో గింగురుమంటున్నాయి

కసిమొగ్గలుగానే మసిబారిపోతే
ఆ కన్నతల్లుల కడుపుకోత
మనకంట మారింది కన్నీటి సంద్రంగా

క్షమించరాని నేరం
భరించలేని ఘోరం జరిగిపోయింది
మధ్యాన్న భోజనం మృత్యువుగా మారింది

తారణ ఉగాదికి స్వాగతంపలికాం
మంగల తోరణాలతో
కానీ మనకేం తెలుసు
కొంగు చాటున సునామీ రక్కసిని
కొన్నినెలల పాటు దాచేస్తుందని
మనం ఏమరపాటుగా ఉన్నప్పుడు
అది మీదపడి దాడి చేస్తుందని
రాకాసి అలగా విరుచుకు పడుతుందని

తారణం మోసుకొచ్చిన
సునామీవిషాదం ఎన్నివేల కుటుంబాలలోనో-

సానియా మిర్జా సాధించిన విజయాలు 
తెలుగు జాతికి తీపి గురుతులు మిగిల్చినా
తారణం నడకంతా చాప కింద నీరులా
వేప పూవెక్కువైన ఉగాదిపచ్చడిలా
చేదు అనుభవాల గురుతుగా మిగిలింది

రాజకీయ రహస్యమో -మఠంలో కావేషమో
జనం మెచ్చని-మాయని మచ్చ -కంచి కధ
కంచికో కోర్టుకో తేల్చాల్సినది పార్ధివం

కాలం -చేసిన గాయాలను
 మాన్పుతుంది మరుపు మందువేసి
నడిపిస్తుంది మునుముందుకి
అందుకే ఆశావాదంతో అడుగు ముందుకేద్దాం
స్వాగతం పలుకుదాం పార్థివ ఉగాదికి

ఉక్కు సాహితి ఉగాది కవిసమ్మేళనం 

No comments:

Post a Comment